Nigeria Road Accident: నైజీరియాలో ఘోర రోడ్డు ప్రమాదం.. 12 మంది మృతి

13 Mar, 2022 10:17 IST|Sakshi

నైజీరియా: దక్షిణ నైజీరియాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. భారత కాలమానం ప్రకారం శనివారం అర్థరాత్రి ఓటే టౌన్‌లో బస్సు-ట్రక్కు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో 12 మంది ప్రయాణికులు అక్కడికక్కడే మృతి చెందారు.

ఈ ఘటనలో మరో ఆరుగురికి తీవ్ర గాయాలు కాగా, వారిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. రోడ్డు ప్రమాదంలో 12 మంది మృతి చెందినట్లు పోలీసు అధికారులు వెల్లడించారు. ట్రాఫిక్‌ రూల్స్‌ ఉల్లంఘించారని, వాహనాల అతివేగం కారణంగా ఈ రోడ్డు ప్రమాదం జరిగినట్లు అధికారులు తెలిపారు.

మరిన్ని వార్తలు