ఘోర ప్రమాదం.. వైర్లు తెగి ఊడిపడిన లిఫ్ట్.. ముగ్గురి మృతి

18 Mar, 2023 10:58 IST|Sakshi

సాక్షి, ఎన్టీఆర్: జిల్లాలోని ఇబ్రహీంపట్నం వీటీపీఎస్‌లో ఘోర ప్రమాదం జరిగింది. వైర్లు తెగడంతో లిఫ్ట్ అమాంతం కిందపడిపోయింది. ఈ ఘటనలో ముగ్గురు మరణించినట్లు తెలుస్తోంది. ప్రమాద సమయంలో లిఫ్టులో మొత్తం  8 మంది ఉన్నారు.

వీరంతా పైకి వెళ్తుండగా లిఫ్టు వైర్లు ఒక్కసారిగా తెగిపోయాయి. దీంతో అంతా లిఫ్టుతో పాటు కిందపడిపోయారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వీరిలో పలువురికి తీవ్ర గాయాలయ్యాయి.
చదవండి: పెళ్లింట విషాదం.. అప్పుడు వరుడి తండ్రి.. ఇప్పుడు వధువు తండ్రి..

మరిన్ని వార్తలు