శిరోముండనం కేసు విచారణ సమయంలో కడుపునొప్పి అంటూ డ్రామా
ముగిసిన మూడు రోజుల కస్టడి.. తిరిగి సెంట్రల్ జైల్కు
సాక్షి, విశాఖపట్నం: మాజీ ఐఏఎస్ పీవీ రమేష్ పేరిట పలువురు అధికారులకు ఫోన్లు చేసి మోసం చేసిన కేసులో సినీ నిర్మాత, బిగ్ బాస్ ఫేం నూతన్నాయుడునుసోమవారం సాయంత్రం పోలీసులు సెంట్రల్ జైలుకు తరలించారు. విశాఖ పోలీసులు ఇటీవల ఆయనను అరెస్ట్ చేసి 14 రోజుల పాటు రిమాండ్కు ఆరిలోవ సెంట్రల్ జైల్కు పంపిన విషయం తెలిసిందే. అయితే శని, ఆది, సోమవారాల్లో విచారణ నిమిత్తం పోలీస్ కస్టడీకి కోర్టు అనమతిచ్చింది. విచారణ అనంతరం తిరిగి జైలుకు పంపారు.
మళ్లీ పోలీస్ కస్టడీ కోరతాం..
బ్యాంక్ ఉద్యోగం ఇస్తామని రూ.12 కోట్లు తీసుకుని మోసం చేసినట్టు నమోదైన కేసులో అవసరమైతే నూతన్నాయుడిని మళ్లీ పోలీస్కస్టడీకి ఇవ్వాలని కోర్టును కోరతామని డీసీపీ–1 ఐశ్వర్య రస్తోగి మీడియాతో చెప్పారు.