మైసూరు: గూగుల్ మీట్ ద్వారా ఉపాధ్యాయురాలు విద్యార్థులకు ఆన్లైన్లో పాఠాలను బోధిస్తున్న సమయంలో అశ్లీల వీడియో ప్రసారమైన సంఘటన మైసూరులో చోటు చేసుకుంది. ఒక ప్రైవేటు స్కూల్ క్లాస్ జరుగుతున్న సమయంలో లింక్లోకి గుర్తు తెలియని యువకుడు చొరబడి అశ్లీల వీడియో పెట్టాడు.
గమనించిన టీచర్ క్లాస్ను బంద్ చేసింది. ఎవరు ఈ నేరానికి పాల్పడ్డారో గుర్తించి శిక్షించాలని సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేయగా దర్యాప్తు చేపట్టారు.