బస్సులో ప్రయాణికుడి మృతి

2 Mar, 2021 11:19 IST|Sakshi

కడప కోటిరెడ్డిసర్కిల్‌ : మైదుకూరు నుంచి కడపకు వస్తున్న ఆర్టీసీ బస్సులో మైదుకూరు మండలం తిప్పిరెడ్డిపల్లె గ్రామానికి చెందిన వేపరాల యర్రన్న (80) మృతి చెందారు. ఈయన కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధతున్నారు. ఇతన్ని భార్య సాలమ్మ రిమ్స్‌కు తీసుకు వస్తుండగా మార్గమధ్యంలో సీటులోనే కుప్పకూలి మృతి చెందాడు. బస్సు బస్టాండుకు రాగానే ఆర్టీసీ సెక్యూరిటీ హెడ్‌ కానిస్టేబుల్‌ శివారెడ్డి, కానిస్టేబుల్‌ రవి, చిన్నచౌకు ఔట్‌పోస్టు సిబ్బంది గోపాల్‌లు మేము సైతం స్వచ్ఛంద సంస్థ వారితో కలిసి మృతదేహాన్ని తిప్పిరెడ్డిపల్లెకు పంపించే ఏర్పాట్లు చేశారు. 

చదవండిజాతరకు వెళ్తుండగా రోడ్డు ప్రమాదం 

వయసు ఎక్కువని హేళన.. విద్యార్థి ఆత్మహత్య   

మరిన్ని వార్తలు