పబ్జీ ఆట: రెండు గ్రామాల మధ్య చిచ్చు

3 Mar, 2021 08:23 IST|Sakshi

సాక్షి, కృష్ణాజిల్లా: పబ్జీ ఆటలో చెలరేగిన వివాదం రెండు గ్రామాల మధ్య చిచ్చు పెట్టింది. పరస్పర దాడులకు దారి తీసింది. ఈ క్రమంలో ఇద్దరు గాయాలపాలయ్యారు. వివరాలు.. నూజివీడులో కళాశాల నుంచి బస్సులో వెళుతూ కొత్తూరు తండా, సిద్దార్ధనగర్ విద్యార్థులు పబ్జీ ఆడారు. ఈ క్రమంలో మాటా మాటా పెరిగి బాహాబాహాకి దిగారు. ఈ గొడవ కాస్తా ముదిరి రెండు గ్రామాల మధ్య చిచ్చు పెట్టింది.

ఇందులో పెద్దలు జోక్యం చేసుకోవడంతో వివాదానికి మరింత ఆజ్యం పోసినట్లయింది. ఈ క్రమంలో గ్రామస్తులు కర్రలు ,రాళ్లతో పరస్పర దాడులకు దిగారు. ఈ ఘటనలో ఇద్దరికి గాయాలయ్యాయి. వారిని ప్రస్తుతం నూజివీడు ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఈ నేపథ్యంలో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కాగా చైనీస్‌ పబ్జీ గేమ్‌పై భారత ప్రభుత్వం నిషేధం విధించిన విషయం విదితమే.

చదవండి: ‘డబ్బు ఇవ్వకుంటే పురుగుల మందు తాగుతాం’

మరిన్ని వార్తలు