ఎమ్మెల్యే ఇంటిపై బాంబు దాడి 

6 Aug, 2021 14:22 IST|Sakshi

సాక్షి, భువనేశ్వర్‌: గంజాం జిల్లాలోని కళ్లికోట్‌ ఎమ్మెల్యే సూర్యమణి బైద్య ఇంటిపై కొంతమంది గుర్తుతెలియని దుండగులు బాంబులు విసిరి పరారయ్యారు. ఈ దుర్ఘటనలో ఎమ్మెల్యే మద్దతుదారుల్లోని నలుగురు వ్యక్తులకు తీవ్రగాయాలయ్యాయి. ఈ సమాచారం అందుకున్న కళ్లికోట్‌ పోలీసులు హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకుని, కేసు నమోదు చేశారు. అనంతరం క్షతగాత్రులను కళ్లికోట్‌ ప్రభుత్వాస్పత్రికి తరలించి, ప్రాథమిక చికిత్స అందజేశారు.

ఆ తర్వాత మెరుగైన వైద్యం కోసం వారిని బరంపురం ఎంకేసీజీ ఆస్పత్రికి తరలించామని ఎస్‌డీపీఓ గౌతమ్‌ కృష్ణ తెలిపారు. నిమ్మజర గ్రామంలోని ఎమ్మెల్యే ఇంటిపై దాడి జరగగా, ఈ ఘటన వెనక ఉన్న కారణాలు ఇంకా తెలియరావాల్సి ఉందని గంజాం జిల్లా ఎస్పీ బ్రజేష్‌కుమార్‌ రాయ్‌ పేర్కొన్నారు.    

మరిన్ని వార్తలు