30 కోట్ల విలువైన వజ్రాభరణాల స్వాధీనం

4 Oct, 2020 10:42 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: శంషాబాద్ విమానాశ్రయం కేంద్రంగా ముంబైకి తరలించేందుకు పంపిన కొరియర్‌లో భారీగా వజ్రాభరణాలు, బంగారాన్ని కస్టమ్స్‌ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. శంషాబాద్ ఎయిర్‌పోర్ట్, ఎయిర్ కార్గోలో ఈ ఉదయం ఎయిర్ ఇంటెలిజెన్స్ అండ్ కస్టమ్స్ అధికారుల విస్తృత తనిఖీలు నిర్వహించారు. గడిచిన నాలుగైదు గంటలుగా శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో కస్టమ్స్ అధికారులు విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. డిప్యూటీ కమిషనర్, అసిస్టెంట్ కమిషనర్, ఇన్స్పెక్టర్ల సభ్యుల బృందం అధ్వర్యంలో తనిఖీలు కొనసాగుతున్నాయి.

ముంబయికి తరలించేందుకు స్మగ్లర్ పన్నిన పన్నాగాన్ని పసిగట్టిన కస్టమ్స్ అధికారుల బృందం ఈ తనిఖీలు చేపట్టింది. శంషాబాద్ ఎయిర్ పోర్ట్‌లో భారీ ఎత్తున బంగారం, డైమండ్ జ్యువలరీ ఆభరణాలు అక్రమ రవాణా జరుగుతుందని ఎయిర్ పోర్ట్‌లోని ఎయిర్ కార్గోలో ఈ రవాణా జరుగుతోందని డిప్యూటీ కమిషనర్‌ అధికారుల బృందానికి సమాచారం అందింది. స్వాధీనం చేసుకున్న కొరియర్‌ని ఓపెన్ చేసిన అధికారులు డైమండ్ వజ్రాభరణాలను పెద్ద పెద్ద తూనికలు కొలతలు వెయిట్‌ మిషన్ల సహాయంతో లెక్కిస్తున్నారు.  (దూసుకెళ్లిన కారు; తప్పిన పెనుప్రమాదం)

వజ్రాభరణాలుకి పైనుంచి వెండి పూత పూసి బంగారాన్ని గుర్తుపట్టకుండా అమర్చి గోల్డ్ మాఫియా తరలిస్తున్నట్టు గుర్తించారు. ముంబై వెళుతున్న పార్సెల్‌లో వజ్రాభరణాలు, బంగారం , ఆర్నమెంట్స్ అన్నీ కలిపి ఇప్పటిదాకా 21 కేజీలు గుర్తించారు. కాగా.. వీటి విలువ 30 కోట్ల రూపాయలకు పైబడి ఉంటుందని అంచనా. ఈ పార్సిల్‌ని శ్రీపాల్ జైన్ అనే వ్యక్తి  ముంబయి అడ్రస్‌కి పంపుతున్నట్టు ఉండగా అశోక్ అనే వ్యక్తి నుండి పార్సల్ ఫ్రమ్ అడ్రస్ ఉండటం విశేషం.

>
మరిన్ని వార్తలు