సాక్షి, ఛత్తీస్గఢ్: నారాయణపూర్ అంబైడ్గనిలో మావోయిస్టుల దాడికి పాల్పడ్డారు. జేసీబీ సహా 6 వాహనాలను మావోయిస్టులు తగలబెట్టారు. సూపర్వైజర్ సహా కార్మికులను మావోయిస్టులు కిడ్నాప్ చేశారు. మావోయిస్టుల కాల్పుల్లో ఇద్దరు కార్మికులు మృతి చెందారు. కార్మికుల కిడ్నాప్ను అడ్డుకునేందుకు భద్రతా బలగాలు తీవ్రంగా యత్నించాయి. మావోయిస్టులు, భద్రతా బలగాల మధ్య కాల్పులు కొనసాగుతున్నాయి.