నకిలీ చలాన్ల వ్యవహారం: ముగ్గురు అరెస్టు

20 Aug, 2021 12:45 IST|Sakshi

వైఎస్సార్‌ కడప: నకిలీ చలానాల కేసులో ముగ్గురు స్టాంప్‌ రైటర్లను శుక్రవారం స్థానిక పోలీసులు అరెస్టు చేశారు. కాగా, జింకా రామకృష్ణ, అనములు లక్ష్మీనారాయణ, గురుప్రకాశ్‌ లు అరెస్టు అయిన వారిలో ఉన్నారు.

వీరందరూ కడప అర్బన్‌, రూరల్‌ రిజిస్ట్రార్‌ ఆఫీసుల్లో రూ.కోటి 3 లక్షలు కాజేసినట్లు పోలీసులు గుర్తించారు. ఈ మేరకు నిందితులను అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. 

మరిన్ని వార్తలు