కలకలం: పట్టపగలు.. చేతిసంచిలో 20 నాటు బాంబులు

25 Jul, 2021 04:39 IST|Sakshi
పోలీసుల అదుపులో అనుమానితుడు (ఎర్ర చొక్కా వ్యక్తి). చిత్రంలో నాటు బాంబులు ఉన్న చేతిసంచి

పోలీసుల తనిఖీల్లో బట్టబయలు 

ఉలిక్కిపడిన చిత్తూరు జిల్లా 

వెదురుకుప్పం (చిత్తూరు జిల్లా): పట్టపగలే ఓ వ్యక్తి చేతిసంచిలో నాటుబాంబులు తీసుకెళ్తూ పోలీసులకు పట్టుబడిన ఘటన శనివారం చిత్తూరు జిల్లాలో తీవ్ర ప్రకంపనలు రేపింది. వివరాల్లోకి వెళితే.. వెదురుకుప్పం మండలంలోని బ్రాహ్మణపల్లె సమీపంలోని మహేశ్వరపురం ఎస్టీ కాలనీకి చెందిన దొరస్వామి (37) తీసుకెళ్తున్న ఓ చేతిసంచిని అనుమానంతో పోలీసులు తనిఖీ చేశారు.

ఆ సంచిలో ఉన్న నాటు బాంబులను చూసి ఒక్కసారిగా ఉలిక్కిపడి.. దొరస్వామిని అదుపులోకి తీసుకున్నారు. ఆ బాంబులు ఎందుకోసం తీసుకొస్తున్నారు? ఎక్కడ నుంచి తెస్తున్నారనే వివరాలను పోలీసులు సేకరిస్తున్నారు. చేతిసంచిలో సుమారు 20 నాటు బాంబులు ఉన్నట్లు తెలిసింది. దర్యాప్తు కొనసాగుతున్నదని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని  ఎస్‌ఐ గోపి తెలిపారు.   

మరిన్ని వార్తలు