సాక్షి, నిజామాబాద్: నిజామాబాద్లో వ్యభిచారం నిర్వహిస్తున్న ముఠా గుట్టురట్టైంది. స్థానిక గాయత్రినగర్లో ఓ ఇంట్లో వ్యభిచారం నిర్వహిస్తున్నారనే సమాచారంతో టాస్క్ఫోర్స్ పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ దాడిలో మొత్తం 11 మందిని పోలీసులు అరెస్టు చేశారు. ఇందులో నిర్వాహకురాలితోపాటు ఇద్దరు విటులు ఉన్నారు. వ్యభిచార గృహంలో ఎనిమిది మంది మహిళలను కాపాడి స్థానిక పోలీస్ స్టేషన్కు తరలించారు. కాగా గాయత్రి నగర్ కేంద్రంగా కొంతకాలంగా ఓ మహిళ ముందుండి వ్యభిచారం నడిపిస్తున్నట్లు తెలుస్తోంది. వివిధ పనుల కోసం నిజామాబాద్ వచ్చే యువతులు, మహిళలను పడుపు వృత్తిలోకి దింపుతున్నట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో తెలిసింది. ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారు తప్పనిసరి పరిస్థితుల్లో ఈ రొంపిలోకి దిగుతున్నట్లు పోలీసులు చెబుతున్నారు.
ఆర్మూర్టౌన్: పట్టణంలోని పేకాట ఆడుతున్న ఏడుగురిని శుక్రవారం పోలీసులు అరెస్టుచేశారు. ఆఫీసర్స్ క్లబ్లో దాడులు నిర్వహించి రూ. 2.58 లక్షలు, ఏడు సెల్ఫోన్లు, మూడు కార్లను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. దాడుల్లో టాస్క్ఫోర్స్ సీఐ వెంకటేష్ పాల్గొన్నారు.