మంత్రి మల్లారెడ్డిపై పోలీసు కేసు

8 Dec, 2020 17:55 IST|Sakshi

మంత్రి మల్లారెడ్డిపై భూవివాదంలో కేసు నమోదు

మహిళ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన దుండిగల్ పోలీసులు

సాక్షి, హైదరాబాద్‌ : తెలంగాణ మంత్రి మల్లారెడ్డిపై భూ కబ్జా కేసు నమోదైంది. మేడ్చల్ జిల్లాలోని దుండిగల్ పోలీస్ స్టేషన్‌లో ఈ కేసు నమోదైంది. తన భూమిలో మల్లారెడ్డి అక్రమ నిర్మాణాలు చేపట్టారంటూ.. కుత్బుల్లాపూర్‌ మండలం సూరారంకు చెందిన శ్యామలదేవి అనే మహిళ మల్లారెడ్డిపై పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. మల్లారెడ్డి చెరలో ఉన్న భూమిని విడిపించాలంటూ ఓ న్యాయవాదిని సంప్రదిస్తే.. ఆయనతోనే మంత్రి మల్లారెడ్డి కుమ్మకై తప్పుడు పత్రాలు సృష్టించారని ఆమె తన ఫిర్యాదులో పేర్కొన్నారు. మహిళ ఫిర్యాదు మేరకు దుండిగల్‌ పోలీసులు మంత్రి  మల్లారెడ్డిపై కేసు నమోదు చేశారు.
(చదవండి : భార్యను హతమార్చి.. పక్కనే వీడియో గేమ్‌ ఆడుతూ!)

మరిన్ని వార్తలు