బెడిసి కొట్టిన ఏనుగు దంతాల విక్రయం 

16 Jan, 2021 22:12 IST|Sakshi
ఎస్‌టీఎఫ్‌ స్వాధీనం చేసుకున్న ఏనుగు దంతాలు

భువనేశ్వర్‌/సంబల్‌పూర్‌: ఏనుగు దంతాల విక్రయం డీల్‌ బెడిసి కొట్టింది. ఈ వ్యవహారంలో ఇద్దరు నిందితులను ప్రత్యేక టాస్కు ఫోర్సు(ఎస్‌టీఎఫ్‌) అరెస్టు చేశారు. వీరి దగ్గర నుంచి 2 ఏనుగు దంతాలను స్వాధీనం చేసుకున్నారు. విశ్వసనీయ సమాచారం సంబల్‌పూర్‌ ఒంయిఠాపల్లి ఠాణా బొరెయిపా లి ప్రాంతంలో ఆకస్మికంగా దాడి చేయగా.. హృషీకేష్‌ కుంభార్, గోపాలకృష్ణ బుడొకొని వీటితో చిక్కారు. నిందితులను అరెస్టు చేసి, దర్యాప్తు చేస్తున్నారు. 

మరిన్ని వార్తలు