సాక్షి, హైదరాబాద్ : రాజేంద్రనగర్ ట్రాఫిక్ పోలీసులు నిర్వహించిన డ్రంక్ అండ్ డ్రైవ్లో పట్టుబడిన బహదూర్పురా కానిస్టేబుల్ కె.వెంకటేశ్ను సస్పెండ్ చేస్తున్నట్లు నగర పోలీసు కమిషనర్ అంజనీ కుమార్ బుధవారం ఆదేశాలు జారీ చేశారు. విధులకు హజరవుతున్న వెంకటేశ్ మద్యం సేవించి ఉండటంపై రాజేంద్రనగర్ ట్రాఫిక్ పోలీసులు కేసు నమోదు చేశారు. దీంతో నగర పోలీసు కమిషనర్ అంజనీ కుమార్ వెంటనే సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. మొత్తం ఓ కానిస్టేబుల్ డ్రంక్ అండ్ డ్రైవ్లో పట్టుబడి సస్పెండ్ అవ్వడంపై పోలీసు శాఖలో చర్చనీయాశమైంది.