ప్రియురాలితో కలిసి కుట్ర చేసి భార్యను..

26 Mar, 2021 15:58 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

మిస్టరీ వీడిన మహిళ హత్యకేసు

భర్త, అతని ప్రియురాలు, మరో ఏడుగురి అరెస్ట్‌

యశవంతపుర/కర్ణాటక: సుద్ధగుంటపాళ్య పోలీస్‌స్టేషన్‌ పరిధిలో ఈనెల 19న చోటు చేసుకున్న మహిళ హత్యకేసు మిస్టరీని పోలీసులు ఛేదించారు. ప్రియురాలితో కలిసి భర్తనే ఆమెను హత్య చేయించినట్లు తేల్చారు. ఈమేరకు తిలక్‌నగరకు చెందిన అప్సర్‌ఖాన్‌(41), అతడి ప్రియురాలు తస్సింభాను(29), వీరికి సహకరించిన తబ్రేజ్‌పాషా(26), సయ్యద్‌ వసీం(26), వెంకటేశ్‌(19), భరత్‌(18), యుగేంద్ర(19), చేతన్‌(19) ఇబ్రాహిం(19)లను పోలీసులు అరెస్ట్‌ చేశారు. మరో మైనర్‌ బాలుడిని కూడా అదుపులోకి తీసుకున్నారు.

కాగా సుద్దగుంటపాళ్యలో మహమ్మద్‌ షరిఫా, అప్సర్‌ఖాన్‌ దంపతులు నివాసం ఉంటున్నారు. రెండేళ్లుగా అప్సర్‌ఖాన్‌ తన బంధువు తస్లింభానుతో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడు. ఈ విషయమై భార్య పలుసార్లు మందలించింది. దీంతో భార్యను అడ్డు తొలగించాలని అప్సర్‌ఖాన్‌  సుపారి ఇచ్చాడు. ఈ నెల 19న ఆమెను దుండగులు మారణాయుధాలతో హత్య చేశారు. సుద్ధగుంటపాళ్య పోలీసులు అప్పర్‌ఖాన్‌పై అనుమానంతో అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టగా ప్రియురాలితో కలిసి భార్యను హత్య చేయించినట్లు వెలుగు చూసింది.

చదవండి: ముగ్గురు భార్యలు.. 3 అస్థిపంజరాలు: వీడిన మిస్టరీ

మరిన్ని వార్తలు