సాక్షి, విజయవాడ : గరుడ బస్సులో శుక్రవారం పెద్ద మొత్తంలో నగదు పట్టుబడింది. ఓ ప్రయాణికుడి బ్యాగులో 50 లక్షల రూపాయల్ని పోలీసులు కనుగొన్నారు. సరైన పత్రాలు లేకుండా పట్టుబడ్డ నగదును ఐటీ అధికారులకు అప్పగించారు. సదరు ప్రయాణికుడ్ని విశాఖ పెందుర్తి మహాన్యూస్ రిపోర్టర్ సూర్యనారాయణగా గుర్తించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. హవాలా మనీ అన్న కోణంలో విచారణ చేస్తున్నారు.
చదవండి : దుర్గ గుడి ‘దొంగ’ దొరికాడు