ఎస్సైని కాల్చి చంపిన ఉగ్రవాది

13 Sep, 2021 05:01 IST|Sakshi

ఘటనకు పాల్పడిన వారిని గుర్తించాం: కశీ్మర్‌ పోలీస్‌ చీఫ్‌

శ్రీనగర్‌: ఉగ్రవాది చేతిలో ఎస్సై హతమైన ఘటన జమ్మూకశీ్మర్‌లోని శ్రీనగర్‌లో చోటు చేసుకుంది. ఆదివారం మధ్యాహ్నం 1.35 గంటల సమయంలో ఈ ఘటన జరిగిందని అధికారులు వెల్లడించారు. పాయింట్‌ బ్లాక్‌ రేంజ్‌లో తల వెనుక భాగంలో తుపాకీతో కాలి్చన దృశ్యాలు సీసీ ఫుటేజీల్లో నమోదయ్యాయి. తీవ్రంగా గాయపడిన ప్రొబేషనరీ సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ ఆర్షిద్‌ అహ్మద్‌ను ఆస్పత్రికి తరలించినప్పటికి ప్రయోజనం లేకపోయింది. శ్రీనగర్‌లోని ఖన్యార్‌ ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఘటనానంతరం పోలీసులు మార్కెట్‌ పరిసర ప్రాంతాల్లో సోదాలు నిర్వహించారు.   నిందితుల్ని గుర్తించామని, త్వరలోనే వారిని చట్టం ముందుకు తీసుకొస్తామని జమ్మూకశ్మీర్‌ పోలీస్‌ చీఫ్‌ దిల్‌బాగ్‌ సింగ్‌ పేర్కొన్నారు. ఓ నిందితుడిని వైద్య పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి తీసుకెళ్లిన సమయంలో ఘటన జరిగిందని వెల్లడించారు.  

మరిన్ని వార్తలు