మీర్‌పేట్‌లో వ్యభిచారం.. ఇద్దరు యువతులు, 3 విటుల అరెస్ట్‌

29 Jun, 2021 09:23 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

సాక్షి, మీర్‌పేట: వ్యభిచార గృహంపై ఎస్‌ఓటీ పోలీసులు దాడి చేసి నిర్వాహకురాలితో పాటు ఇద్దరు యువతులు, ముగ్గురు విటులను ఎల్‌బీనగర్‌ ఎస్‌ఓటీ పోలీసులు అరెస్టు చేశారు. గాయత్రినగర్‌లోని ఓ ఇంట్లో వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు సమాచారం అందుకున్న ఎల్‌బీనగర్‌ ఎస్‌ఓటీ పోలీసులు సోమవారం సాయంత్రం దాడి చేశారు. నిర్వాహకురాలు సరితతో పాటు ఇద్దరు యువతులు, విటులు గాయత్రినగర్‌కు చెందిన కుంచా వెంకటరమణ (45), వనస్థలిపురం సాగర్‌కాంప్లెక్స్‌కు చెందిన విజల యాదగిరి(51), బడంగ్‌పేట ద్వారకాహిల్స్‌కు చెందిన నేలేటి శ్రీనివాసులు(51)లను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి ర.10380 నగదు, 7 సెల్‌ఫోన్‌లు, ఒక బ్రెజా కారును సీజ్‌ చేసి అనంతరం మీర్‌పేట పోలీస్‌స్టేషన్‌లో అప్పగించారు.

చదవండి: బార్‌లో వ్యభిచారం.. ఇద్దరు యువతులు, నిర్వాహకుల అరెస్ట్‌ 

మరిన్ని వార్తలు