పేకాట స్థావరాలపై దాడి; సునీత ముఖ్య అనుచరుడి అరెస్ట్‌

8 Nov, 2020 19:15 IST|Sakshi

సాక్షి, అనంతపురం: జిల్లాలో పేకాట స్థావరాలపై పోలీసులు ఆదివారం దాడులు నిర్వహించారు. కనగానపల్లి మండలం పర్వతదేవరపల్లి గ్రామశివారులో మాజీ మంత్రి పరిటాల సునీత సమీప బంధువు పరిటాల తిప్పన్న వ్యవసాయ క్షేత్రంలో పేకాట స్థావరాన్ని గుర్తించారు. అక్కడ పేకాట ఆడుతున్న 10 మంది పరిటాల అనుచరుల్ని పోలీసులు అదుపులోకి తీసుకొని, నగదును స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన వారిలో పరిటాల సునీత ముఖ్య అనుచరుడు రామ్మూర్తి నాయుడు ఉన్నట్లు సమాచారం​.  చదవండి: (తునిలో ఎన్నారై సురేశ్‌ మృతి కలకలం.. భార్యే..!)

చదవండి: (నంద్యాల కుటుంబం ఆత్మహత్య: సీఐ, హెడ్‌ కానిస్టేబుల్‌ అరెస్ట్‌)

>
మరిన్ని వార్తలు