నీ జీవితం నువ్వు చూసుకో.. భార్యకు మెసేజ్‌ చేసి హోంగార్డు ఆత్మహత్య

27 Feb, 2023 11:12 IST|Sakshi

సాక్షి, అన్నానగర్‌: కళ్లకురిచ్చి జిల్లా త్యాగతురుగం సమీపంలోని మెల్విలి గ్రామానికి చెందిన ఆంథోని రాజ (33) చిన్న సేలం పోలీస్‌స్టేషన్‌లో హోంగార్డుగా పని చేస్తున్నాడు. కళ్లకురిచ్చి పోలీస్‌ క్వార్టర్స్‌లో నివాసం ఉంటున్నాడు. భార్య శీల పౌరిమేరి, ఆరేళ్ల కుమార్తె, ఏడాదిన్నర కుమారుడు ఉన్నారు. శనివారం భార్యభర్తల మధ్య గొడవ జరిగింది. శీలపౌరిమేరి బయటకు వెళ్లింది.

ఆంథోని రాజ విధులకు వెళ్లి సాయంత్రం ఇంటికి తిరిగి వచ్చాడు. భార్య ఇంటిలో లేకపోవడంతో మనస్తాపానికి గురయ్యాడు. తన భార్యకు నీ జీవితం చూసుకో.. నేను నా జీవితాన్ని ముగించుకుంటున్నాను అని మెసేజ్‌ పంపాడు. ఇది చూసి శీలపౌరిమేరి ఇంటికి వచ్చి చూడగా తలుపు గెడియపెట్టి ఉంది. ఇరుగుపొరుగు వారి సాయంతో తలుపులు తెరిచిచూడగా ఆంథోని రాజ ఉరి వేసుకుని మృతి చెందాడు. కళ్లకురిచ్చి పోలీసులు కేసు నమోదు చేశారు.

(చదవండి: గుండెపోటుతో నవ వరుడు హఠాన్మరణం)

మరిన్ని వార్తలు