మార్కులు వేయిస్తానని వేధింపులు 

14 Nov, 2021 10:51 IST|Sakshi
ప్రిన్సిపాల్‌ హయ్యాళప్ప

సాక్షి, రాయచూరు(కర్ణాటక): విద్యార్థులను తండ్రి మాదిరిగా చూసుకోవాల్సిన ప్రిన్సిపాల్‌ కీచకుని అవతారమెత్తి కటకటాల పాలయ్యాడు. వర్కులు ఎక్కువ వేస్తానని నమ్మించి విద్యార్థినులను లైంగికంగా వేధిస్తున్న ప్రిన్సిపాల్‌ హయ్యాళప్పను అరెస్ట్‌ చేశారు. నిందితుడు యాదగిరి తాలక ముండరిగి కిత్తరు రాణి చెన్నమ్మ గురుకుల పాఠశాల ఇన్‌చార్జి ప్రిన్సిపాల్‌గా ఉన్నాడు.

పదవ తరగతి పరీక్షలలో అధిక మార్కులు వేసి ఉత్తీర్ణులు చేస్తానని మభ్యపెట్టి బాలికలతో అసభ్యంగా ప్రవర్తించేవాడు. శుక్రవారం రాత్రి జిల్లా కలెక్టర్‌ రాగప్రియ హాస్టల్‌ను పరిశీలనకు వచ్చారు. ఆ సమయంలో విద్యార్థినులు ఆమె ముందు తమ గోడును వెళ్లబోసుకున్నారు. ఆమె ఆదేశాలతో ఎస్పీ వేదమూర్తి వెంటనే ప్రిన్సిపాల్‌ హయ్యాళప్పపై కేసు నవెదు చేయించి అరెస్ట్‌ చేశారు.

మరిన్ని వార్తలు