'అనంత'లో అదుపు తప్పిన వోల్వో బస్సు

12 Nov, 2020 08:30 IST|Sakshi

సాక్షి, అనంతపురం : జిల్లాలోని పాలసముద్రం సమీపంలో గురువారం ఉదయం ఓ ప్రైవేట్‌ ట్రావెల్స్‌ బస్సు అదుపు తప్పింది. ఎన్‌హెచ్‌-44పై ఈ సంఘటన చోటుచేసుకుంది. వేగంగా వెళుతున్న వోల్వో బస్సు అదుపు తప్పి రోడ్డు పక్కకు ఒరిగిపోయింది. ఈ ప్రమాదంలో అయిదుగురికి స్వల్పంగా గాయాలు అయ్యాయి. పెను ప్రమాదం తప్పడంతో బస్సులోని ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. బస్సు బెంగుళూరు నుంచి హైదరాబాద్ వెళ్తుండగా ఘటన జరిగింది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.   (అనంతపురం జిల్లాలో ఘోర రోడ్డుప్రమాదం)

మరిన్ని వార్తలు