Gachibowli: ఓయో రూమ్‌లో వ్యభిచారం.. నలుగురు అరెస్ట్‌ 

22 Sep, 2022 17:31 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఓయో రూమ్‌లో వ్యభిచారం జరుగుతుందనే సమాచారం మేరకు దాడి చేసి నలుగురు నిందితులను అరెస్ట్‌ చేసినట్టు రాయదుర్గం పోలీసులు తెలిపారు. పోలీసులు తెలిపిన∙వివరాలు ఇలా ఉన్నాయి .. గచ్చిబౌలి పీజేఆర్‌నగర్‌లోని గ్యాస్‌ గోడౌన్‌ రోడ్డులోని ఓయో హోటల్‌లో వ్యభిచారం నిర్వహిస్తున్నారనే విశ్వసనీయ సమాచారం మేరకు   పోలీసులు మంగళవారం సాయంత్రం ఆకస్మిక దాడులు నిర్వహించారు.

కమలాకర్‌రెడ్డి అనే వ్యక్తి ఓయో హోటల్‌లో గదులు తీసుకొని వ్యభిచార కేంద్రం నిర్వహిస్తున్నాడని అతనికి ఎండీ రఫీక్‌(32), అమిత్‌కుమార్‌ అనే వ్యక్తులు సహాయకులుగా ఉంటూ ఇతర రాష్ట్రాల నుంచి తీసుకొస్తున్నారని, వీరితోపాటు వ్యభిచారానికి పాల్పడుతున్న 9 మంది బెంగాల్, ఆంధ్రప్రదేశ్, ముంబాయి, కర్నాటక రాష్ట్రాలకు చెందిన అమ్మాయిలను రెస్క్యూ హోమ్‌లకు తరలించారు.

ఇదిలా ఉండగా ప్రధాన నిందితుడు కమలాకర్‌రెడ్డి, అతని సహాయకుడు అమిత్‌కుమార్‌ పరారీలో ఉన్నారు. నిందితుల నుంచి 5 సెల్‌ఫోన్లు, 29 కండోమ్‌ ప్యాకెట్లు, రూ.15,050 నగదు, ఇతర సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. 
చదవండి: ‘నువ్వంటే ఇష్టం... నాతో ఉండిపో’.. వివాహితకు సినీ కెమెరామెన్‌ వేధింపులు

మరిన్ని వార్తలు