లాడ్జీలో వ్యభిచారం.. 8 మంది అరెస్టు

24 Nov, 2021 16:33 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

సాక్షి, నిర్మల్: జిల్లా కేంద్రంలో గుట్టుచప్పుడు కాకుండా వ్యభిచారం చేస్తున్న వారిని పోలీసులు పట్టుకొని గుట్టురట్టు చేశారు. శివాజీచౌక్‌లో ఓ ఫంక్షన్‌ పక్కనే గల లాడ్జీపై పట్టణ సీఐ శ్రీనివాస్, స్పెషల్‌ బ్రాంచ్‌ పోలీసుల ఆధ్వర్యంలో సంయుక్తంగా మంగళవారం దాడి నిర్వహించారు.

వ్యభిచారం చేస్తున్న 8 మంది విటులతోపాటు యువతులను పట్టుకున్నారు. వారిని అదుపులోకి తీసుకోని విచారణ నిమిత్తం పట్టణ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. అలాగే సంబంధిత లాడ్జీ యజమాన్యంపై కేసు నమోదు చేశారు. విషయమై పట్టణ సీఐ వివరణ కోరగా త్వరలోనే వివరాలు వెల్లడిస్తామని తెలిపారు.    

మరిన్ని వార్తలు