Chennai: కేరళ, కర్ణాటక యువతులను ఇంట్లో నిర్బంధించి వ్యభిచారం

22 Jan, 2023 12:12 IST|Sakshi

సాక్షి, చెన్నై: తమిళనాడు రాజధాని చెన్నై సమీపంలోని అంబత్తూరులో వ్యభిచారం నిర్వహిస్తున్న ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు. విజయలక్ష్మీ పురానికి చెందిన కల్యాణి (30), మొగప్పేర్‌కు చెందిన  రాజేష్‌ (40) కేరళ, కర్ణాటక, ఉత్తరాది రాష్ట్రాలకు చెందిన యువతులను కొరటూరులోని ఓ ఇంట్లో నిర్బంధించి వ్యభిచారం చేయించారు. సమాచారం అందుకున్న అవడి పోలీస్‌ కమిషనర్‌ దాడి చేశారు.

కల్యాణి, రాజేష్‌లను అరెస్టు చేశారు. ఇద్దరు యువతులను రక్షించి ప్రభుత్వ మహిళా ఆశ్ర మంలో చేర్పించారు. నిందితులు ఇప్పటికే రెండుసార్లు వ్యభిచారం కేసుల్లో పట్టుబడినట్లు గుర్తించారు. కల్యాణినిపై గూండా చట్టం ప్రయోగించాలని ఆవడి మున్సిపల్‌ పోలీస్‌ కమిషనర్‌ సందీప్‌ రాయ్‌ శనివారం ఆదేశించారు.

మరిన్ని వార్తలు