Hyderabad: అపార్ట్‌మెంట్‌లో వ్యభిచారం.. పోలీసుల దాడి

14 May, 2022 07:36 IST|Sakshi
ప్రతీకాత్మకచిత్రం

సాక్షి, హైదరాబాద్‌: ఓ అపార్ట్‌మెంట్‌లో వ్యభిచారం నిర్వహిస్తున్న ఇంటిపై మియాపూర్‌ పోలీసులు దాడి చేసి ఇద్దరిని అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించారు. ఎస్‌ఐ లింగానాయక్‌ తెలిపిన మేరకు.. మియాపూర్‌లోని ఓ అపార్ట్‌మెంట్‌లో వ్యభిచారం నిర్వహిస్తున్నారన్న సమాచారం అందడంతో గురువారం దాడి చేశారు. ఒంగోలుకు చెందిన నిర్వాహకులు షేక్‌ ఇర్ఫాన్‌ (22), సాయిగణేష్‌రెడ్డి (27), మహిళను అదుపులోకి తీసుకున్నారు.  దీంతో షేక్‌ ఇర్ఫాన్, గణేష్‌రెడ్డిలను అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించారు. మహిళను రెస్క్యూ హోమ్‌కు తరలించినట్లు తెలిపారు.  

చదవండి: (దినేష్‌ దశ తిరిగెన్‌.. మోసపోయిన కంపెనీ నుంచే బంపర్‌ ఆఫర్‌)

మరిన్ని వార్తలు