ఐపీఎల్‌ బెట్టింగ్: రూ.16 కోట్లు‌ స్వాధీనం

12 Oct, 2020 09:28 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: నగరంలో అతి పెద్ద ఐపీఎల్‌ బెట్టింగ్‌ ముఠా గుట్టు రట్టైంది. హైదరాబాద్‌లో రాజస్తాన్‌ రాష్ట్ర ఉగ్రవాద నిరోధక బృందం(ఏటీఎస్‌) సోదాలు చేపట్టింది. ఈ తనిఖీల్లో ఐపీఎల్‌ క్రికెట్‌ బెట్టింగ్‌కు పాల్పడుతున్న ఏడుగురిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఐపీఎల్ బెట్టింగ్ రాకెట్ నడుపుతున్న గణేణ్‌ను పోలీసులు పట్టుకున్నారు. ఏడుగురు సభ్యుల నుంచి రూ.16కోట్ల నగదు స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. తెలంగాణ, ముంబై, ఢీల్లీ రాజస్థాన్ కేంద్రంగా క్రికెట్‌ బెట్టింగ్ నడుస్తున్నట్లు తెలిపారు. దేశవ్యాప్తంగా పెద్ద మొత్తంలో బెట్టింగ్ పాల్పడుతున్న ముఠాను అదుపులోకి తీసుకున్నట్లు పేర్కొన్నారు. సైబరాబాద్ పరిధిలో ఈ ముఠా బెట్టింగ్‌కు పాల్పడుతోందని తెలిపారు. అరెస్టైన వారిలో గణేష్, సురేష్, పంకజ్,  సత్తయ్యతో పాటు మరో ముగ్గురు వ్యక్తులు ఉన్నారని చెప్పారు. ఐపీఎల్-2020 మొదలైనప్పటి నుంచి దేశ వ్యాప్తంగా అతిపెద్ద క్రికెట్ బెట్టింగ్‌ ముఠా అని పోలీసులు తెలిపారు. అన్ని రాష్ట్రాల్లో ముఠాలను ఏర్పాటు చేసి గణేష్‌ బెట్టింగ్ నడుపుతున్నాడని తెలిపారు. 

మరిన్ని వార్తలు