జైపూర్: దొంగతనాలు కూడా ఓ ఉద్యోగంలో చేస్తోంది ఓ ముఠా. ఆ ముఠా గ్యాంగ్ లీడర్ రోజూ దొంగతనానికి టార్గెట్ ఇస్తాడు. అవి చేరుకున్న వాళ్లకు బోనస్లు, ఇంక్రిమెంట్లు ఇలా ఎన్నో ప్రోత్సాహకాలు కూడా ఇస్తున్నాడు. అసలు ఇంతకీ వాళ్లు చేయాల్సిన పని ఏంటంటే.. వాహనాలను దొంగిలించడం, వాటిని విడదీయడం, ఆ విడిభాగాలను బయట విక్రయించడం, మిగిలిపోయిన వస్తువులను డంపింగ్ చేయడం.
వీటికి కోసం అతను ప్రత్యేక నెలవారీ ప్యాకేజీను ఉద్యోగులకు ఇస్తున్నాడు ఓ ఘనుడు. చివరికి జైపూర్ పోలీస్ స్టేషన్ 10 మంది దుండగులను పట్టుకోవడంతో ఆ ముఠా అసలు బండారం బయటపడింది. దీంతో పాటు పట్టుబడిన వారి నుంచి స్కూటీలు, బ్యాటరీలు, ఈ-రిక్షాలు సహా డజన్ల కొద్దీ వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఆశ్చర్యకర ఘటన రాజస్తాన్లో చోటు చేసుకుంది. ఓ వ్యక్తి చాలా మంది నిరుద్యోగులకు డబ్బు ఎర చూపి వారి ఆర్థిక పరిస్థితులను అవకాశంగా చేసుకుని దొంగతనాలకు ప్రేరేపించి వాళ్లను దొంగలుగా మారుస్తున్నాడు.
ఈ ముఠా.. అదును చూసి ఈ-రిక్షాలు, బైక్లు మాయం చేస్తారు. ఆ తర్వాత వాటి ఇంజిన్లను తీసి టైర్లు, బ్యాటరీలు వీడిగా చేయడంతో ఆ వాహనాన్ని తక్కుకింద మారుస్తారు. కాగా దొంగలు ఎవరు ఏం పని చేయాలనే ముందుగానే ఆ గ్యాంగ్ లీడర్ నిర్ణయిస్తాడు. ఇలా ప్రతీది ఓ ప్లాన్ ప్రకారం చేసి వందలాది బైకులను అమ్మి సొమ్ము చేసుకుంటోంది ఆ ముఠా. కాగా ఇలాంటి ఓ దొంగల కంపనీని 2018లో సైతం ఓ క్రిమినల్ నిర్వహించినట్టు పోలీసులు చెబుతున్నారు. అయితే తాజాగా బయటపడ్డ దొంగలకు మాత్రం నెలకు 30 వేల రూపాయలు ఇస్తున్నట్టు పోలీసులు తెలిపారు.