కారు చెట్టును ఢీకొట్టి...డ్రైవర్‌ మృతి 

26 Apr, 2022 23:00 IST|Sakshi
ప్రమాదంలో నుజ్జు నుజ్జు అయిన కారు (ఇన్‌సెట్‌) మృతుడు పోతురాజు   

మరో ముగ్గురికి గాయాలు 

అడ్డతీగల: వేటమామిడి శివారున సోమవారం కారు అదుపుతప్పి చెట్టుని ఢీకొట్టిన దుర్ఘటనలో కారు నడుపుతున్న అడ్డతీగల సినిమాహాలు కాలనీకి చెందిన చింతోజి పోతురాజు(20) అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యాడు. ఈ సంఘటనలో మరో ముగ్గురు గాయపడ్డారు. రాజవొమ్మంగి నుంచి కియా కారు వేసుకొచ్చిన స్నేహితులతో పోతురాజు డ్రైవింగ్‌ చేస్తూ వై.రామవరం వైపు వెళ్తుండగా అదుపుతప్పి రోడ్డు పక్కనే ఉన్న చెట్టుని బలంగా ఢీకొట్టడంతో పోతురాజు తల ముఖం ఇతర శరీర భాగాలపై తీవ్రగాయలై అక్కడికక్కడే మృతి చెందాడు.

చెట్టుని ఢీకొట్టిన కారు వై.రామవరం–అడ్డతీగల ప్రధాన రహదారికి అడ్డంగా నిలిచిపోయింది. అటుగా వెళ్తున్న వాహనదారులు 108 వాహనానికి, పోలీసులకు సమాచారం ఇచ్చారు. క్షతగాత్రులైన రాజవొమ్మంగికి చెందిన బీరబోయిన సుబ్రహ్మణ్యం అనే వ్యక్తితో పాటు నందిగ నవదీప్, గోకుల్‌ అనే ఇరువురు బాలురను 108 వాహనంలో అడ్డతీగల సామాజిక ఆరోగ్యకేంద్రానికి తరలించి చికిత్స చేస్తున్నారు. వీరికి స్వల్పగాయాలయ్యాయి. కాగా పోతురాజు మృతదేహాన్ని అడ్డతీగల సామాజిక ఆరోగ్యకేంద్రానికి పోస్ట్‌మార్టమ్‌ నిమిత్తం తరలించారు. అడ్డతీగల పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. 

మరిన్ని వార్తలు