East Godavari: ఘోర రోడ్డు ప్రమాదం: నలుగురు మృతి

13 May, 2021 06:47 IST|Sakshi

సాక్షి, తూర్పు గోదావరి: జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. పెద్దాపురం ఏడీబీ రోడ్డులో ఓ లారీ కారును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో అక్కడికక్కడే నలుగురు మృతి చెందారు. ఈ ఘటనలో మరో నలుగురికి తీవ్ర గాయాలు అయ్యాయి. గాయపడిన వారిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని పరిశీలిస్తున్నారు. పెనుగుదురు నుంచి రాజమండ్రి వెళ్తుండగా ఈ ఘటన జరిగినట్లు పోలీసులు పేర్కొన్నారు.

చదవండి: మీరు డాక్టరా..? అయితే రూ.2 వేలు 

మరిన్ని వార్తలు