గన్నవరంలో బొలెరో బీభత్సం

9 Aug, 2021 07:37 IST|Sakshi

బైక్‌ను ఢీకొట్టి పాదచారులపైకి దూసుకెళ్లిన బొలెరో

సాక్షి, కృష్ణా జిల్లా: గన్నవరంలో బొలెరో వాహనం బీభత్సం సృష్టించింది. హెచ్‌పీ గ్యాస్ కంపెనీ సమీపంలో జాతీయ రహదారిపై బైక్‌ను ఢీకొట్టి పాదచారులపైకి బొలెరో దూసుకెళ్లింది. ఈ ఘటనలో పాదచారుడు మృతి చెందాడు. బైక్‌పై వెళ్తున్న వ్యక్తి తీవ్రంగా గాయపడగా, ఆసుపత్రికి తరలించారు. మృతుడు దావాజిగూడెంకు చెందిన నాగయ్యగా పోలీసులు గుర్తించారు. బోలెరో వాహనం విజయవాడ నుండి ఏలూరు వైపు వెళ్తుండగా ప్రమాదం జరిగింది.
 

మరిన్ని వార్తలు