మధిర: లారీ, ట్రాక్టర్ ఢీకొనడంతో ఓ వ్యక్తికి తీవ్ర గాయాలైన సంఘటన పట్టణంలోని వైరా రోడ్లో శనివారం రాత్రి చోటుచేసుకుంది. ఆత్కూరుకు చెందిన సీతారావమ్మ అనారోగ్యంతో మృతిచెందగా.. టెంట్ సామగ్రి తీసుకొచ్చేందుకు అదే గ్రామానికి చెందిన వెంకట్రామనర్సయ్య తన ట్రాక్టర్ తీసుకుని మధిరకు వచ్చాడు. ఈ క్రమంలో సుబాబుల్ లోడ్తో వస్తున్న లారీ వెనుక నుంచి ట్రాక్టర్ను బలంగా ఢీకొట్టింది. దీంతో ట్రాక్టర్ ఇంజిన్ పల్టీ కొట్టింది. డ్రైవర్ వెంకట్రామనర్సయ్య కిందపడగా తలకు తీవ్ర గాయమైంది. క్షతగాత్రుడిని 108 వాహనంలో మధిర ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అతడి పరిస్థితి విషమంగా ఉండటంతో ఖమ్మంకు తరలించారు. మద్యం మత్తులో ఉన్న లారీ డ్రైవర్కు స్థానికులు దేహశుద్ధి చేశారు.