ట్రాక్టర్‌ కిందికి దూసుకెళ్లిన కారు.. ఆరుగురు దుర్మరణం

5 Jul, 2021 13:42 IST|Sakshi

జైపూర్‌: రాజస్థాన్‌ రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జోధ్‌పూర్‌లో తెల్లవారుజామున డంగియావస్‌ సమీపంలో  ఓ కారు.. ట్రాక్టర్‌ కిందికి దూసుకెళ్లింది. దీంతో కారులో ప్రయాణిస్తున్న ఆరుగురు వ్యక్తులు అక్కడికక్కడే మృతిచెందారు. ప్రమాదం గురించి సమాచారం అందుకున్న పోలీసులు ప్రమాద స్థలానికి చేరుకున్నారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు..మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ ప్రమాదం సోమవారం తెల్లవారుజామున 2 గంటల ప్రాంతంలో జరిగిందని పోలీసులు తెలిపారు .ఈ ప్రమాదంలో మృతులందరూ  అజ్మీర్ జిల్లా కు  చెందినవారని పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనపై డిసిపి భువన్ భూషణ్ యాదవ్ మాట్లాడుతూ మృతదేహాలను ఎండిఎం ఆసుపత్రిలో ఉంచినట్లు తెలిపారు.
 

మరిన్ని వార్తలు