అనంతపురం తాడిపత్రిలో ఘోర రోడ్డు ప్రమాదం

15 Sep, 2020 06:52 IST|Sakshi

సాక్షి,అనంతపురం : జిల్లాలోని తాడిపత్రి శివారు వద్ద మంగళవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. తిరుచానూరు నుంచి తాడిపత్రికి వస్తున్న తుఫాన్ వాహనాన్ని గుర్తుతెలియని వాహనం వెనుక నుంచి బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందగా.. ఏడుగురికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన క్షతగాత్రులను స్థానికులు ఆసుపత్రికి తరలించారు. ప్రమాదంలో మృతి చెందినవారు తాడిపత్రి వాసులేనని తేలింది. కాగా ప్రమాదంలో మృతి చెందిన వారు హేమలత, సుబ్రమణ్యం, వెంకట రంగయ్యగా గుర్తించారు. 

మరిన్ని వార్తలు