సాక్షి, హైదరాబాద్: మల్కాజ్గిరిలో దారుణ ఘటన చోటుచేసుకుంది. మైనర్ బాలికపై ఆర్పీఎఫ్ ఏఎస్సై లల్లూ సెబాస్టియన్ అత్యాచారానికి పాల్పడ్డారు. ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి బాలికను పలుమార్లు బెదిరించి అత్యాచారం చేశారు. బాలిక తల్లిదండ్రులకు అనుమానం వచ్చి నిలదీయడంతో విషయం బయటపడింది. దీంతో బాలిక తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఏఎస్సై లల్లూ సెబాస్టియన్ను అదుపులోకి తీసుకుని రిమాండ్కు తరలించారు. చదవండి: (సంచలనం రేపిన స్వాతి హత్య.. అసలేం జరిగింది..?)