యువతిపై దాడి: కార్పొరేటర్‌ అరెస్ట్‌ 

21 Sep, 2020 19:07 IST|Sakshi
(ఫైల్‌ ఫోటో)

సాక్షి, హైదరాబాద్‌ : యువతిపై దాడి చేసిన కేసులో శేరిలింగం పల్లి కార్పొరేటర్‌ రాగం నాగేందర్‌ యాదవ్ను సైబరాబాద్‌ పోలీసులు సోమవారం అరెస్ట్‌ చేశారు. వారం రోజుల క్రితం నల్లగండ్లలోని గ్రేటర్‌ కమ్యూనిటీలో ఉండే ఓ ఫ్యాషన్‌ డిజైనర్‌ యువతితో నాగేందర్‌ గొడవ పడ్డారు. అనంతరం యువతిపై దాడి చేశారు. దీంతో సదరు యువతి షీ టీమ్‌ను ఆశ్రయించి, అతడిపై ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు సోమవారం అతడ్ని అదుపులోకి తీసుకున్నారు.

చదవండి : సుమేధ మృతి: మంత్రి కేటీఆర్‌పై ఫిర్యాదు

మరిన్ని వార్తలు