రాసలీలల కేసు: రూ.5 కోట్లు డిమాండ్‌ చేశారు, కానీ..

17 Mar, 2021 10:28 IST|Sakshi

సాక్షి, బెంగళూరు: కన్నడనాట రాసలీలల సీడీ కేసు దర్యాప్తులో క్రమంగా కొత్త విషయాలు వెలుగుచూస్తున్నాయి. వీడియోలో కనిపించి పదవిని కోల్పోయిన మాజీ మంత్రి రమేశ్‌ జార్కిహొళిని మంగళవారం సిట్‌ అధికారులు బెంగళూరులోని ఆయన నివాసంలో సుమారు రెండు గంటల పాటు విచారించి నాలుగు పేజీల వాంగ్మూలాన్ని నమోదు చేశారు. ఆ వీడియో సీడీ సంగతి తనకు నాలుగు నెలల క్రితమే తెలుసని రమేశ్‌ చెప్పినట్లు తెలిసింది.

ఆ వీడియోను చూపి రూ. ఐదు కోట్లను ఇవ్వాలని తనను డిమాండ్‌ చేశారని తెలిపారు. కానీ ఈ విషయాన్ని పెద్దగా పట్టించుకోలేదని, తన రాజకీయ ఎదుగుదలను అడ్డుకునేందుకు ఇలా నకిలీ సీడీతో కుట్ర పన్నారని అన్నారు. వీడియోలో ఉన్నది తాను కాదని, ఆ సీడీకి తనకు ఎలాంటి సంబంధం లేదన్నారు.  

చదవండి: (అరచేతిలో స్వర్గం చూపించింది: ప్రియుడు)

(రాసలీలల కేసు: ఆమె కోసం హైదరాబాద్‌కు..)

మరిన్ని వార్తలు