సోషల్‌ మీడియాలో రెచ్చగొట్టే పోస్టింగ్‌లు.. ఇద్దరిపై కేసు

6 Jul, 2021 18:31 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

సాక్షి, ఉప్పల్‌(హైదరాబాద్‌): మత విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా సోషల్‌ మీడియాలో పోస్టింగ్‌లు చేసిన ఇద్దరిపై ఉప్పల్‌ పోలీసులు కేసు నమోదు చేశారు. సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్న ఇద్దరి పోస్టింగ్‌లపై పోలీసులు సుమోటాగా స్వీకరించి కేసు నమోదు చేసి­నట్లు తెలిపారు.

కాలు సింగ్‌ హిందీలో, మహ్మద్‌ కలీం ఉర్దులో పోస్టింగ్‌లు పెట్టడంతో ఇద్దరూ విద్వేశాలు రెచ్చగొట్టడంతోపాటు లా అండ్‌ ఆడర్‌ సమస్య తలెత్తే విధంగా ఉన్నాయని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఉప్పల్‌ పోలీసులు తెలిపారు.

మరిన్ని వార్తలు