అత్యాచార బాధితురాలికి అండగా రాష్ట్ర మహిళా కమిషన్

13 Aug, 2021 14:09 IST|Sakshi
( ఫైల్‌ ఫోటో )

వైఎస్సార్‌ కడప: కడప జిల్లాలో  బాలికపై అత్యాచారం జరిగిన ఘటనలో బాధిత కుటుంబానికి రాష్ట్ర మహిళా కమిషన్ అండగా నిలిచింది. జిల్లా ఎస్పీతో మాట్లాడి కఠిన చర్యలు తీసుకోవాలని మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ కోరారు. బాలిక తల్లిదండ్రులతో ఆమె మాట్లాడి ధైర్యం చెప్పారు. కాగా మహిళా కమిషన్ సభ్యురాలు గజ్జెల లక్ష్మీ బాధిత బాలికను పరామర్శించారు.

మరిన్ని వార్తలు