దారుణం: 4 ఏళ్ల బాలికపై మారుతండ్రి అత్యాచారం

12 Mar, 2021 14:31 IST|Sakshi

లక్నో: ఉత్తరప్రదేశ్ లో ‌ దారుణం చోటుచేసుకుంది. నాలుగేళ్ల బాలికపై మారుతండ్రి (స్టెప్‌ ఫాదర్‌) లైంగిక దాడికి పాల్పడిన ఘటన గురువారం సాయంత్రం జరిగింది. ఈ ఘటనపై బాలిక మామయ్య రతన్‌పూరి స్టేషన్‌ హౌజ్‌లో ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి అతడిని అరెస్టు చేసినట్లు స్టేషన్‌ హౌజ్‌ ఆఫీసర్‌ వింధ్యచల్‌ తివారి తెలిపారు. పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం.. ముజఫర్‌ జిల్లాలోని ఓ గ్రామానికి చెందిన మైనర్‌ బాలిక తల్లి రెండేళ్ల క్రితం నిందితుడు(50)ని రెండో పెళ్లి చేసుకుంది.

బాధిత బాలిక ఆమె మొదటి భర్త కూతురు. ఈ క్రమంలో నిన్న సాయంత్రం నిందితుడు బాలికను సమీపంలో పొలాల్లోకి తీసుకేళ్లి అత్యాచారం చేశాడు. ఈ విషయం తెలియగానే గ్రామస్తులంతా నిందితుడి ఇంటి ఎదుట గుమికూడి అతడిని అరెస్టు చేయాలని డిమాండ్‌ చేశారు. దీంతో సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు అతడిని అదుపులోకి తీసుకుని పొక్సో చట్టం, అత్యాచారం కింద కేసు నమోదు చేశారు.

మరిన్ని వార్తలు