ఆన్‌లైన్‌ క్లాసులో అనామకుడు ప్రత్యక్షం.. 

24 Jun, 2021 10:45 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

సాక్షి, హిమాయత్‌నగర్‌(హైదరాబాద్‌): విద్యార్థులకు ఆన్‌లైన్‌ క్లాసులు నిర్వహిస్తుండగా.. ఓ అనామకుడు మధ్యలోకి వచ్చి అంతరాయం కలిగించడంతో అంబర్‌పేట సిస్టర్‌ నివేదిత స్కూల్‌ ప్రిన్సిపాల్‌ లతాకుమారి బుధవారం సైబర్‌క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఐడీ ద్వారా ఆన్‌లైన్‌ క్లాసులోకి లాగిన్‌ అయి విద్యార్థుల పేర్లు మార్చడం వంటి అల్లరి చేష్టలు చేశాడు. దీనిపై విద్యార్థులు ఆందోళన చెందడంతో అతడిపై చర్యలు తీసుకోవాలని లతా కుమారి బుధవారం సైబర్‌క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశారు.  

చదవండి: కోవిడ్‌తో మరణించిన జర్నలిస్టులకు రూ.2 లక్షలు

మరిన్ని వార్తలు