కోదాడలో దారుణం: ప్రేమ జంట ఆత్మహత్య

26 Feb, 2021 12:16 IST|Sakshi

చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్న జంట

సాక్షి, సూర్యాపేట: జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. ప్రేమ జంట చెరువులో పడి ఆత్మహత్య చేసుకుంది. వివరాలు.. కోదాడ లక్ష్మిపురం కాలనీకి చెందిన సాయి(19) ఐటీఐ పూర్తి చేశాడు. ఈ క్రమంలో ఇతడికి అదే కాలనీకి చెందిన ఫాతిమా(15)తో పరిచయం ఏర్పడింది. అది కాస్త ప్రేమగా మారింది. ఈ క్రమంలో రెండు రోజుల క్రితం సాయి ఇంటి నుంచి బయటకు వెళ్లాడు. మళ్లీ తిరిగి రాలేదు. ఫాతిమా నిన్న ఇంట్లో నుంచి వెళ్లిపోయింది. 

ఆ తర్వాత వీరద్దరూ కోదాడ చెరువులో పడి ఆత్మహత్య చేసుకున్నారు. ఈ క్రమంలో శుక్రవారం వీరి శవాలు వెలుగు చూశాయి. విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సింది. 

చదవండి: ఒలింపిక్‌ మాజీ జిమ్నాస్టిక్స్‌ కోచ్‌‌ ఆత్మహత్య!

మరిన్ని వార్తలు