ఛార్జింగ్‌లో పేలిన ఎలక్ట్రిక్ బండి.. ఘటనలో తండ్రీకూతుళ్ల మృతి

26 Mar, 2022 21:03 IST|Sakshi

Electric Bike Explodes: తమిళనాడులో ఘోరం జరిగింది. ఎలక్ట్రిక్ బండి పేలుడు ఘటనలో తండ్రీకూతుళ్లు దుర్మరణం పాలయ్యారు. వెల్లూరు అ‍ల్లపురం ఏరియాలో శుక్రవారం రాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది. 

ఘటనలో బైక్‌ ఓనర్‌ దురైవర్మ(49)తో పాటు ఆయన కూతురు మోహన ప్రీతి(13) దుర్మరణం పాలయ్యారు. కొత్తగా బైక్‌ కొన్న దురై.. శుక్రవారం రాత్రి ఇంట్లోనే బైక్‌ను ఛార్జింగ్‌ పెట్టారు.  ఈ క్రమంలో బైక్‌ పేలి ఒక్కసారిగా మంటలు అంటుకుంది. మంటల్ని ఆర్పేందుకు వర్మ, ప్రీతి బాత్‌రూం నుంచి నీళ్లు గుమ్మరించే ప్రయత్నం చేయబోయారు. అయితే పొగకు ఉక్కిరి బిక్కిరి అయ్యి.. అక్కడికక్కడే మృతి చెందారు ఈ తండ్రీకూతుళ్లు. 

మంటల్ని చూసిన చుట్టుపక్కల వాళ్లు.. రెస్క్యూ అధికారులకు సమాచారం అందించారు. వాళ్లు వచ్చి చూసే లోపే.. ఆ పొగలో దురై, ప్రీతీలు విగత జీవులుగా పడి ఉన్నారు. ఈ ఘటనతో స్థానికంగా విషాదం అలుముకుంది.

>
మరిన్ని వార్తలు