కీచకుడిగా మారిన టీడీపీ వార్డు కౌన్సిలర్‌..

28 Aug, 2021 14:05 IST|Sakshi

అనంతపురం: అనంతపురం జిల్లా తాడిపత్రిలో టీడీపీ కౌన్సిలర్‌ కీచకుడిలాగా ప్రవర్తించాడు. తాడిపత్రికి చెందిన 33 వ వార్డు కౌన్సిలర్‌ విజయ్‌కుమార్‌ ఒక మహిళను వేధించడమే కాకుండా అసభ్యపదజాలంతో మెసేజ్‌లు పంపాడు. దీంతో విసిగిపోయిన సదరు మహిళ స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు. ప్రస్తుతం ఈ సంఘటన స్థానికంగా కలకలం రేపింది.

చదవండి: ఓటుకు కోట్లు కేసు: రేవంత్‌ రెడ్డికి సమన్లు

>
మరిన్ని వార్తలు