అక్రమ మద్యం విక్రయిస్తూ పట్టుబడిన అధ్యాపకులు

14 Mar, 2021 05:16 IST|Sakshi
పట్టుబడిన అధ్యాపకులు, మద్యం సీసాలు, ద్విచక్ర వాహనాలతో సెబ్‌ అధికారులు

గుంటూరు జిల్లాలో నలుగురి అరెస్ట్‌ 

సత్తెనపల్లి: అధ్యాపకులు సైతం తేలిగ్గా డబ్బు సంపాదించేందుకు అడ్డదారులు తొక్కుతున్నారు. తెలంగాణ నుంచి మద్యం తీసుకొచ్చి విక్రయిస్తూ అధికారులకు దొరికిపోయారు. గుంటూరు జిల్లా సత్తెనపల్లిలో జరిగిన ఈ ఘటనకు సంబంధించి స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బ్యూరో(సెబ్‌) సీఐ ఈడె మారయ్యబాబు తెలిపిన వివరాలు.. సౌత్‌ సెంట్రల్‌ రైల్వే క్యాంటీన్‌ వర్కర్‌ రావూరి సాయికృష్ణ, పట్టణంలోని ఎస్‌వీఆర్‌ డిగ్రీ కళాశాల కామర్స్‌ అధ్యాపకుడు పొందుగల శ్రీనివాసరెడ్డి, కళాశాల ప్రిన్సిపాల్‌ గంటా శ్రీనివాసరావు, వంట మాస్టార్‌ షేక్‌ వలీ ఒక బృందంగా ఏర్పడి నిత్యం రైల్లో తెలంగాణ మద్యం తీసుకొచ్చి విక్రయాలు జరుపుతున్నారు. ముందస్తు సమాచారం ప్రకారం సెబ్‌ అధికారులు శుక్రవారం రాత్రి దాడులు నిర్వహించారు. పట్టణంలో రెండు ద్విచక్ర వాహనాల్లో మద్యం సీసాలు పెట్టుకుని విక్రయిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. వారి నుంచి 20 మద్యం సీసాలను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు.  

మరిన్ని వార్తలు