డంబెల్స్‌ మీద పడి యువకుడు మృతి

13 Mar, 2021 09:24 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

యాచారం: వ్యాయామం చేస్తుండగా డంబెల్స్‌ మీదపడి యువకుడు మృతిచెందిన ఘటన మండల పరిధిలోని నక్కర్తమేడిపల్లి గ్రామంలో చోటుచేసుకుంది. వివరాలు.. ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఫిరోజ్‌(19) స్థానికంగా ఎస్‌ఆర్‌ హేచరీస్‌లో ఉద్యోగం చేస్తూ అక్కడే నివసిస్తున్నాడు. అతడి నిత్యం ఉదయం వ్యాయామం చేసే అలవాటు ఉంది. ఈ క్రమంలో, రోజూ మాదిరిగానే శుక్రవారం కూడా వ్యాయామం చేస్తుండగా ప్రమాదవశాత్తూ డంబెల్స్‌ మీదపడి అక్కడిక్కడే మృతి చెందాడు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ లింగయ్య తెలిపారు.

చదవండిపాతబస్తీలో రౌడీషీటర్‌ దారుణ హత్య
సరదా కోసం చేస్తాడంటా.. ఇదేం బుద్ధిరా నాయనా

మరిన్ని వార్తలు