-

బాసర ట్రిపుల్ ఐటీలో విద్యార్థి ఆత్మహత్య.. సూసైడ్ నోట్ రాసి..

19 Dec, 2022 07:36 IST|Sakshi

నిర్మల్‌: బాసర ట్రిపుల్ ఐటీలో విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. పీయూసీ 2 చదువుతున్న బాను ప్రసాద్ సూసైట్‌ నోట్ రాసి ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నిర్మల్ ఆస్పత్రికి తరలించారు.

ఈ విద్యార్థి గతంలోనూ ఓసారి ఆత్మహత్యా ప్రయత్నం చేసినట్ల తెలుస్తోంది. అయితే అప్పుడు కౌన్సిలింగ్ ఇచ్చారు. కానీ ఇప్పుడు ఉరివేసుకుని ప్రాణాలు కోల్పోయాడు. విద్యార్థి మృతి నేపథ్యంలో అధికారులు బాసర ట్రిపుల్ ఐటీలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
చదవండి: అప్పుడు కొడుకును.. ఇప్పుడు భార్యను..

మరిన్ని వార్తలు