హైటెక్‌ సిటీలో కారు బీభత్సం.. ఫుట్‌పాత్‌పై ఎగిరిపడ్డ ఆటో

27 Jun, 2021 19:25 IST|Sakshi

తీవ్ర గాయాలతో ఒకరి మృతి

సాక్షి, హైదరాబాద్‌: హైటెక్ సిటీ రహేజా మైండ్‌స్పేస్‌ వద్ద ఆదివారం సాయంత్రం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. మద్యం మత్తులో ఉన్న యువకులు రాష్ డ్రైవింగ్ చేస్తూ తమ ఆడి కారుతో ముందున్న ఆటోను ఢీకొట్టారు. దీంతో ఆటో ఫుట్‌పాత్‌ మీదకు ఎగిరిపడి నుజ్జునుజ్జు అయింది. ఈ ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న ఉమేశ్‌ కుమార్‌ తలకు బలమైన గాయం కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు.

కాగా ప్రమాదానికి కారణమైన యువకులు కారును అక్కడే వదిలి పరారయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకొని ఉమేశ్‌ కుమార్‌ మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించారు. కాగా ఉమేశ్‌ కుమార్‌ మృతికి కారణమైన వారిని విడిచిపెట్టొద్దని అతని బందువులు పోలీస్‌ స్టేషన్‌ ఎదుట ఆందోళన చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీకెమెరాల ఫుటేజీ ఆధారంగా విచారణ జరుపుతున్నట్లు వారికి వివరించారు. 
చదవండి: అరాచకం.. స్కూటర్‌ను ఢీకొట్టాడని చితకబాదారు; వీడియో వైరల్‌

మరిన్ని వార్తలు