పిల్లల్ని స్కూల్‌లో చేర్పించేందుకు వెళ్తుండగా ప్రమాదం.. తండ్రి, కొడుకు, కూతురు మృతి

23 Oct, 2021 17:00 IST|Sakshi

సాక్షి, కొత్తగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. మణుగూరు బీటీపీఎస్‌ ప్లాంట్‌ దగ్గర జరిగిన ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు దుర్మరణం పాలయ్యారు. పిల్లల్ని స్కూల్లో చేర్పించడానికి కుమార్తె, కొడుకుతో కలిసి ఓ తండ్రి బైక్‌పై వెళ్తుండగా వెనుక నుంచి వేగంగా వచ్చిన లారీ వీరిని ఢీ కొట్టింది.

ఈ ఘటనలో తండ్రి, కొడుకు ప్రమాద స్థలంలోనే మృతి చెందగా, కూతురిని ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమద్యమంలో మరణించింది. అతివేగమే ప్రమాదానికి కారణమని స్థానికులు చెప్తున్నారు. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకు చేరుకున్నారు. ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు.

మరిన్ని వార్తలు